google-site-verification=JdHF1jkqQ-qdLV09xKqoTi6x4YOWDwYgt2yiuJH6zPM SAMPOORN HINDI GRAMMER EDUCATION: దసరా పండుగ ప్రాముఖ్యత

Translate

2, అక్టోబర్ 2019, బుధవారం

దసరా పండుగ ప్రాముఖ్యత

                                      దసరా 
   అందరికి విజయదశమి శుభాకాంక్షలు 

హిందువుల ప్రముఖ పండుగలలో దసరాను అత్యంత భక్తిశ్రధ్ధలతో దేవిని/శక్తిని పూజిస్తారు.

దసహార అనగా పదిరోజులు ఇది వాడుకలో దసరాగా పిలుచుకుంటున్నాము.
నవరాత్రులులో శరన్నవరాత్రులు చాలా ముఖ్యమైనవి.
శరన్నవరాత్రులను ఆశ్వయుజమాసం శరదృతువులో శీతకాలం ముందు నవరాత్రుల పండుగను తొమ్మిది రాత్రులు తొమ్మిది రూపాలలో దేవిని అలంకరించి పూజిస్తారు.పదవరోజున విజయదశమితో పండుగ పరాకాష్టకు చేరుకుంటుంది. 


మహిషాసురమర్ధినిగా పూజించే దుర్గామాతను వివిధ రూపాలలో భక్తితో పూజిస్తారు.తొలి మూడురోజులు పార్వతి దేవిగాను,తరువాత మూడురోజులు లక్ష్మిదేవి గాను,చివరి మూడురోజులు సరస్వతి దేవి గాను పూజిస్తారు.శరన్నవరాత్రులలో నవదుర్గల అలంకారంలో  పరాశక్తి దర్శనం చేసుకున్న వారికి పది జన్మల పాపాలు తొలగుతాయి అని విశ్వాసంతో నమ్ముతారు.రాముడు రావణాసురుడుని సంహరించన సందర్భంలో మరియు పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై నుండి కిందకు తీసుకువచ్చిన రోజు అంతేగాక ఆదిపరాశక్తి అయిన దుర్గామాత మహిషాసురుడుతో తొమ్మిది రోజులు యుద్ధం చేసి మహిషాసురుడును వధించి విజయం సాధించడం వలన పదవరోజున విజయదశమి,దసరాను దేశప్రజలంతా అంతో ఆనందంతో జరుపుకుంటారు.  

శరన్నవరాత్రులలో మొదటిరోజు విశిష్టత :

దుర్గామాత శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు హిమవంతునికి కుమార్తెగా శైలపుత్రిదేవి నందివాహనం మీద త్రిశూలధారిణిగా భక్తులకు దర్శన భాగ్యాన్ని కలుగజేస్తుంది.
ఈరోజున భక్తులు పసుపురంగు వస్త్రాలుధరించాలి.
శైలపుత్రి దేవికి పాడ్యమిరోజున పులగంని నైవేధ్యంగా సమర్పిస్తారు.శైలపుత్రిదేవికి చలిమిడి,వడపప్పు,
పాయసం నైవేద్యం సమర్పించాలి. 


రెండవ రోజు విశిష్టత:
ఈరోజున బాలాత్రిపురసుందరి దేవి అలంకారంతో భక్తులు అమ్మవారిని  దర్శనం చేసుకుంటారు.శ్రీచక్రంలో త్రిపురాత్రయంలో త్రిపురసుందరీదేవి ప్రధమ దేవత. రెండేళ్ల నుండి పదేళ్ల మధ్య బాలికలకు అమ్మవారి స్వరూపంగా భావించి కుమారిపూజ చేస్తారు.
త్రిశతి పారాయణం చేస్తారు.ఉపాసకులు అమ్మవారి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు.
బాలాత్రిపురసుందరిదేవి ఆరాధనతో మనోవికారాలు తొలగిపోతాయి.బాలాత్రిపురసుందరి దేవికి శెనగలు మరియు తీపిబూందీ నైవేద్యంగా సమర్పించాలి. 


రెండవరోజు బ్రహ్మచారిణి అవతారంలో అమ్మవారిని పూజిస్తారు.బ్రహ్మ అనగా తపస్సు మరియు వేదం అని అర్ధం. ఈవిధంగా పూజించడం వలన అమ్మవారు మంచి సంతానాన్ని ప్రసాదిస్తుంది.ఈరోజు భక్తులు ఆకుపచ్చ వస్త్రాలు ధరించాలి.బ్రహ్మచారిణి మాతను ఉపాసించడం వలన సర్వత్రా విజయాలు సిద్ధిస్తాయి.



మూడవరోజు విశిష్టత:
ఈరోజు గాయత్రీమాత ముక్త,విద్రుమ,హేమ,నీల,ధవళ వర్ణాలుకలిగినపంచముఖాలతోశంఖం,చక్రం,గద,అంకుశం ధరించిన అలంకారంలో భక్తులు దర్శించుకుంటారు.
గాయత్రిదేవి మాతను పూజించినవారికిబ్రహ్మజ్ఞానం,
మంత్రశక్తి కలుగుతుంది.
గాయత్రిదేవికి రవ్వకేసరి,పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి.


  

మూడవరోజు చంద్రఘంట అవతారంలో అమ్మవారిని పూజిస్తారు.చంద్రఘంటదేవి శిరస్సు మీద అర్ధాకృతిలో అర్ధచంద్రుడు ఉండటం వలన అమ్మవారికి ఈపేరు వచ్చింది.
అమ్మవారిని ధ్యానించిన వారికి సర్వదా అభయగంట మోగుతుంది.ఈరోజు భక్తులు బూడిద రంగు వస్త్రాలు ధరించాలి.



నాలుగోరోజు విశిష్టత:
లలితాదేవి అలంకారంలో భక్తులకు దర్శనభాగ్యం లభిస్తుంది.త్రిపురాత్రయం లలితాదేవి లో రెండవశక్తి.దేవి ఉపాసకులకు అమ్మవిశిష్ట ఫలములు ఇచ్చు దేవత.త్రిగుణాతీతమైన కామేశ్వరి స్వరూపం.లలితాత్రిపురసుందరి దేవి  పంచదశాక్షరి మహామంత్ర అధిష్టాన దేవత.లలితాదేవి అమ్మవారు చెఱుకుగడ ,విల్లు,పాశాంకుశాలు ధరించి కుడివైపు లక్ష్మిదేవి మరియు ఎడమ వైపు సరస్వతి దేవి అమ్మవారు సేవలు చేస్తున్నటువంటి రూపంలో భక్తులను అనుగ్రహిస్తుంది.
అమ్మవారికి ఆకుపచ్చ చీరను అలంకరించిన తరువాత తేనె,పులిహోర,పెసరబురులను సమర్పించిన జాతకంలో గ్రహదోషల ప్రభావం తగ్గును.సంపూర్ణ ఆయురారోగ్యములు కలుగును. అమ్మవారు శ్రీవిద్యా స్వరూపిణి.సృష్టి,స్థితి,సంహార రూపిణి,సమస్తసుఖాలు ప్రసాదించే శక్తిస్వరూపిణి దేవి.


నాల్గవరోజు అవతారంలో కూష్మాoడ దేవిగా ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండడం వలన అష్టభుజదేవి అని కొలుస్తారు.కూష్మాoడ అనగా బూడిద గుమ్మడికాయ.
అమ్మవారు సింహం పై ఆశీనురాలై ఉంటుంది.చేతిలో జపమాలధరించి ప్రజలకు సిద్ధిని,నిధిని ప్రసాదిస్తుంది.  
అమ్మవారు తేజోమయ స్వరూపం.
అమ్మవారిని ఎరుపురంగు వస్త్రాలుతో అలంకరిస్తారు.
ఎరుపు పువ్వులతో పూజించాలి.భక్తులు నారింజరంగు వస్త్రాలు ధరించాలి.దేవిని పూజించినవారికి సకల సంపదలు కలుగుతు.  

  
ఐదోరోజు విశిష్టత:
జగన్మాతసరస్వతీదేవిఅలంకారంలోవీణా,దండ,కమండలం,అక్షమాల ధరించి,అభయముద్రతో శ్వేతపద్మాన్ని ఆసనంగా అధిష్టించి భక్తులకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది.త్రిశక్తిరూపాలలో మూడవరూపం అయినటువంటి సరస్వతిదేవిని పూజించుటవలన బుద్ధివికాసం,విద్యాప్రాప్తి కలుగును.సంగీత సాహిత్యాలకు సరస్వతీమాత అధిష్టాన దేవత.సరస్వతి దేవికి అటుకులు,బెల్లం,కొబ్బరి,శనగపప్పు నైవేద్యం సమర్పించాలి.


  
ఐదోరోజు స్కందమాత అవతారంలో అమ్మవారు కమలాసనంపై పద్మాసనంగా శ్వేతపద్మమ్తో శోభిల్లుతోంది.స్కంధుడుఅనగా కుమారస్వామి.కుమారస్వామి తల్లి కనుక స్కందమాతగా నమ్మిన భక్తులకు పతనం లేకుండా అమ్మవారు  కాపాడుతుంది.అయిదో రోజున భక్తులు తెలుపు వర్ణం వస్త్రాలు ధరించి స్కందమాత పూజచేయాలి.
  

ఆరవరోజు విశిష్టత:
జగన్మాత అన్నపూర్ణాదేవి దేవిఅలంకారంతో భక్తులను అనుగ్రహిస్తుంది. సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం.సాక్షాత్తు శివుడికే భిక్షపెట్టిన దేవతగా అన్నపూర్ణాదేవిని కొలుస్తారు.అన్నపూర్ణాదేవిని పూజించటం వలన ధనం,ధాన్యం,ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది.అన్నపూర్ణాదేవికి పొంగలిని నైవేద్యం సమర్పించాలి. 




అరవరోజు కాత్యాయని అవతారంలో అమ్మవారిని అరవరోజు దర్శించుకుంటాము. కోత్స అనే మహర్షి పార్వతీదేవిని కుమార్తెగా పొందుటవలన కాత్యాయని అనే పేరు వచ్చింది.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సు అంశతో ఒక కాత్యాయనిదేవినిపూజిస్తారు.కాత్యాయనిదేవి మహిషాసురుని విజయదశమినాడు సంహరిస్తుంది.భక్తులు ఎరుపు వర్ణం వస్త్రాలు ధరించాలి.



ఏడవరోజు విశిష్టత:

అమ్మవారు రెండు చేతులతో అక్షమాలలను ధరించి,అభయవరదహస్తముద్రలనుప్రదర్శిస్తూ,గజరాజులతో సేవలందుకుంటూ శ్రీమహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు.
అష్టశక్తుల స్వరూపమైన శ్రీమహాలక్ష్మి అమ్మవారు డోలాసురుడు అనే రాక్షసుడిని వదించింది.
శక్తిత్రయంలో మధ్యశక్తి.శ్రీమహాలక్ష్మిని పూజించుటవలన సకల శుభాలుకలుగుతాయి.మహాలక్ష్మి అమ్మవారికి క్షిరాన్నం నైవేద్యం సమర్పించాలి. 


ఏడవరోజు కాళరాత్రి అనే అవతారంలో అమ్మవారు నల్లగా గాడిద వాహనం కలిగి సకలశుభాలను అందిస్తుంది.అమ్మవారు ఆపదల నుండి భక్తులను  కాపాడుతుంది కనుక శుభంకరి అనే మరో పేరు ఉంది.భక్తులు నీలం రంగు వస్త్రాలు ధరించి పూజించాలి.



ఎనిమిదోరోజు విశిష్టత:
కష్టాలను నివారించే పరాశక్తి దుర్గాదేవి.దుర్గముడు అనే రాక్షసుడుని సంహరించింది.దుర్గాదేవిని పూజించటం వలన సకల శుభాలు,విజయాలు కలుగును.
అమ్మవారికి ఎర్రటివస్త్రం సమర్పించాలి.ఎర్రటి అక్షంతలు,ఎర్రని పూలతో పూజచేయాలి.దుర్గాదేవికి గారెలు,నిమ్మకాయ రసం కలిపిన అల్లం ముక్కలు నైవేద్యం సమర్పించాలి.



 ఎనిమిదోరోజు మహాగౌరి అవతారంఅమ్మవారు పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేయడం వలన శరీరం నల్లబడుతుంది.
శివుడు ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళన చేసిన పిదప విధ్యుత్కాంతులను వెదజల్లుతుండడం వలన మహాగౌరిగా పిలిచుకుంటాము.భక్తులు గులాబీ వస్త్రాలతో అమ్మవారిని పూజించాలి. 


తొమ్మిదోరోజు విశిష్టత:
మహిషాసురుడు అనే రాక్షసుడిని ఆశ్వీయుజ నవమినాడు సంహరించుట వలన మహార్నవమి అని కూడా అంటాము.మహిషాసురుడు దేవతలను,ఋషులను ముల్లోకాలను వేధించడం వలన దేవతలందరు కలసి త్రిమూర్తులను మహిషాసురుని నుండి కాపాడమని వేడుకుంటారు.
త్రిమూర్తుల క్రోధాగ్నినుండి ఒక మహాతేజం స్త్రీ రూపాము ధరిస్తుంది.అష్టాదశ బాహువులు కలిగి,శివుని శూలాన్ని,విష్ణువు చక్రాన్ని,బ్రహమదేవుడు అక్షమాల మరియు కమండలము,వరుణుడి పాశాన్ని,ఇంద్రుడి వజ్రాయుధాన్ని,హిమవంతుని సింహం వాహనంగా ఇచ్చారు.
ఇలా ఒక్కో దేవుడు ఒక్కో ఆయుధాన్ని ధరించి సింహావాహనం మీద సకల దేవతల అంశతో మహిషాసురుడి సైన్యాన్ని తరువాత మహిషాసురుడితో తొమ్మిది రాత్రులు యుద్ధంచేసి మహిషాసురుని సంహరించుటవలన దుర్గమాతను మహిషాసురమర్ధిని అనే పేరు వచ్చింది.మహిషాసుర మర్ధినిదేవికి  చక్రపొంగలిని నైవేద్యం సమర్పించాలి. 



 తొమ్మిదోరోజు సిద్ధిధాత్రి అవతారంలో చతుర్భుజాలతో చక్రం,జాపత్రి,శంఖం,కమలపువ్వుకలిగి ఉంటుంది.
ప్రశాంతమైన రూపంలో అమ్మవారు ఉంటారు.అనగా సిద్ధిధాత్రి అనగా సిద్ధుల దేవత.భక్తులు సిద్ధిదాత్రి అమ్మవారిని పూజించుట వలన సిద్ధి లభిస్తుంది.సిద్ధి అనగా ఆధ్యాత్మిక మరియు మాయ సామర్ధ్యాలు.ఇవి మనతో ఉంటే అలాంటి సమస్యలున్నా విజయాలు సాధించవచ్చు. సిద్ధిదాత్రి అమ్మవారుఉదారంగు చీర కట్టుకొని పూజలందుకుంటారు.సిద్ధిధాత్రి అమ్మవారుకి నువ్వులు భోగంగా సమర్పించడం వలన ప్రమాదాలనుండి కాపాడుతుంది.భక్తులు ఉదారంగు వస్త్రాలు ధరించి పూజలుచేయాలి. 



పదవరోజు విశిష్టతలు:
శరన్నవరాత్రులలో చివరి అలంకారం రాజరాజేశ్వరీదేవి. అనంత శక్తిస్వరూపమైన శ్రీచక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత.మహాత్రిపురసుందరిగా మరియు అపరాజితా దేవిగా భక్తులచే పూజలందుకుంటుంది.లలితాసహస్రనామం మరియు కుంకుమార్చన చేయాలి.
రాజరాజేశ్వరి అమ్మవారికి పులిహోర మరియు గారెలు భోగం సమర్పించాలి.
పదవరోజున ప్రజలంతా ఆనందంతో విజయదశమి,దసరా పండుగను జరుపుకుంటారు. అదేవిధంగా రాముడు రావణుడిని విజయదశమిరోజు సంహరించాడు.
దుర్గమాతను పూజించుట వలన సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. సర్వకార్యాలలో విజయం కలుగుతుంది.

 రాజరాజేశ్వరీదేవి


    
     
      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి