ముక్తావిద్రుమ హేమనీల ధవళఛ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః
యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్వార్ధ వర్ణాత్మాకాం
గాయత్రీం వరదాభయాంకుశ కశాం శుభ్రం కపాలం గదాం
శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహన్తీం భజే!
భావం:
సకల వేద స్వరూపంగా గాయత్రిదేవి.అన్ని మంత్రములకు
మూలశక్తి గాయత్రిదేవి.ముక్త,విద్రుమ,హేమ,నీల,ధవళ వర్ణాలలో
అయిదు ముఖాలతో...శంఖం,చక్రం,గద,అంకుశం దర్శనమిస్తుంది.
గాయత్రిదేవిని ధ్యానించడం వల్ల మంత్రసిధ్ధి,బ్రహ్మ ఙ్ఞనం కలుగుతుంది.
గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద ఫలితం లభిస్తుంది.
గాయత్రి మంత్రం:
"ఓం భూర్భువస్వఃతత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్"
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి