google-site-verification=JdHF1jkqQ-qdLV09xKqoTi6x4YOWDwYgt2yiuJH6zPM SAMPOORN HINDI GRAMMER EDUCATION: AFTER SSC(పదోతరగతి తరువాత)

Translate

25, మార్చి 2019, సోమవారం

AFTER SSC(పదోతరగతి తరువాత)



   
       

పదో తరగతి చదివిన ప్రతీ విద్యార్థి తన ఆసక్తిని బట్టి ఆలోచనలకు అనుగుణంగా ఎటువంటిఉన్నతవిద్యనుఅభ్యసించాలి,
ఎ రంగంలో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి,అని భావిస్తారో అలాంటివారి అందరి కోసం ఉపయోగపడే విధంగా వారికి ఒక దిక్కసూచిలా, విద్యార్థి భవిష్యత్ బంగారుమయం కావాలని  అని ఆశిస్తునాం. 
పదో తరగతి తరువాత ఇంటర్మీడియేట్ లో ఎంపీసీ,బైపీసీ,సీఈసీ,ఎంఈసీ,హెచ్ఈసీ ఉంటాయి.ఎంపీసీ,బైపీసీనిసైన్స్ గ్రూప్స్ అంటారు.
వీటితో పాటు వొకేషనల్ కోర్సులులో కూడా ప్రవేశాలు కల్పిస్తారు.వీటిఅన్నిటిని గురించి ఇప్పుడుతెలుసుకుందాం. 

ఇంటర్మీడియేట్:      1ఇంటర్మీడియట్లోఫిజిక్స్,కెమిస్ట్రీ,మ్యాథమెటిక్స్ గ్రూప్ తీసుకొని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్షా ద్వారా  నచ్చిన విభాగాల్లో  ప్రవేశాలు  పొందవచ్చు. వీటికి ఎంసెట్ మెరిట్ తో పాటు ఇంటర్మీడియేట్ మార్కులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
ప్రతిష్టాత్మక ఎన్ఐటీలో,ఐఐటీల్లో జేజేఈ పరీక్షలు నిర్వహిస్తారు. 
అంతేకాకుండా గీతం యూనివర్సిటీ,విజ్ఞాన్ యూనివర్సిటీలో నిర్వహించే పరీక్షల ద్వారా ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశం కలిపిస్తారు.
ఇలాప్రవేశంపొందినలవారుఇంజనీరింగ్, టెక్నాలజీ,ఆర్కిటెక్చర్,డిజైన్ సంబంధిచిన విభాగాలలోఉన్నతవిద్యను అభ్యసించవచ్చు. 

2ఇంటర్మీడియేట్లో బోటనీ, ఫిజిక్స్,కెమిస్ట్రీ,బయాలజినిముఖ్యమైన సబ్జెక్టుగా కోర్సు ఉంటుంది.
తరువాత మెడిసిన్లో చేరావచ్చు.
అంతేగాక డిఫార్మసి,బీఫార్మసీ,నర్సింగ్ వంటి పారామెడికల్ కోర్సులలో చేరవచ్చు. డిగ్రీలో బిఎస్సీ ఆ తరువాత పి.హెచ్.డి చేసి ఫార్మా కంపెనీ లో స్థిరపడవచు.
మెడిసిన్&సర్జీరి,హోమియోపతి,అగ్రికల్చర్ ఇంజనీరింగ్,ఫుడ్&టెక్నాలజీ,డైరీ&టెక్నాలజీ,యునానిమొదలగునవిఉన్నత విద్యను అభ్యసించవచ్చు. 
3 కామర్స్,సివిక్స్,ఎకానమిక్స్ ని కామర్స్ గ్రూప్ అని అంటారు. పదోతరగతి పాసైన తరువాత చార్టెడ్ అకౌంట్స్ (CA)చేయవచ్చు. ఇంటర్ లో సీఈసీ/ఎంఈ సీ  తో పాటు CPT  ని పూర్తి చేసి సీఏ  లో అడుగు పెట్టవచ్చు. 
4హెచ్ఈసీ చేసిన వారు డిగ్రీలో బి.ఏ,బిజినెస్ మేనేజ్మెట్ ,మార్కెటింగ్ రిలేటెడ్  కోర్సెస్, చెయ్యవచ్చు. సివిల్స్,గ్రూప్స్,డిగ్రీ తరువాత పీజీ చేసి టీచింగ్ లో స్థిరపడవచ్చు. బి.ఎడ్ చేసి టీచర్ గా ప్రభుత్వ కొలువులు చేయవచ్చు. 
5   ఎంఈసీ చేసినవారు పీజీ,పి.హెచ్.డి చేసి సైంటిస్ట్ గా చేరవచ్చు.సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్తో పాటు అన్నీ పరిపాలన పరమైన కొలువులో చేరవచ్చు.చార్టెడ్ అకౌంట్,సివిల్స్,గ్రూప్స్ పరీక్షలు రాయవచ్చు.  


వొకేషనల్ కోర్సెస్:   

ఇంటర్మీడియట్ బోర్డు చాలా వొకేషనల్ కోర్సులు రెగ్యులర్ మరియు స్వల్పకాలికంగా విద్యార్థుల కు అందిస్తున్నాయి. 


కొన్ని జూనియర్ కాలేజీలు వొకేషనల్ కోర్సులు అందుబాటులోకి తెస్తున్నాయి. వీటిలో థియరీ కి 50% మరియు ప్రాక్టికల్ కి 50%ప్రిఫెరెన్సు ఇస్తారు. 
వీటిలో 1-హెల్త్ అండ్ పారా మెడికల్,2-హోమ్ సైన్స్,3-ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ,4-బిజినెస్ అండ్ కామర్స్ ,5-హ్యూమానిటి కోర్సులు. 

ఐ.టి.ఐ:
ఇంటర్ కి సమానంగా ఐ.టి.ఐ తరువాత ఇంజనీరింగ్  వంటి ఉన్నత విద్య ను అభ్యసించవచ్చు.అప్రెంటిస్ చేసి నైపుణ్యం పెంచుకొని  రైల్వే, ఆర్.టి.సి, బెల్,స్టీల్-ప్లాంట్,పెట్రోలియం సంస్థలలో ఉద్యోగాలు చేయవచ్చు.


కోర్సులు: 
టర్నర్,ఎలక్ట్రీషియన్,డీజిల్,మెకానికల్,వెల్డర్,వైర్ మెన్,రేడియో అండ్ టెలివిషన్,ఫిట్టర్ వంటి చాలా కోర్సులు ఉన్నాయ్. 
ఇవి కాకుండా నాన్ ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయ్. 


1-స్టెనోగ్రఫీ 
2-డేస్ మేకింగ్
3-హ్యాండ్ కంపోజర్
4-బుక్ బైండింగ్  
5-కటింగ్ అండ్ టైలరింగ్ 

పాలిటెక్నిక్:
పదోతరగతి తరువాత డిప్లొమా ఇంజనీరింగ్ ఆసక్తి ఉన్నవారు పాలిసెట్ ప్రవేశ పరీక్ష రాసి సీట్ పొందవచ్చు.డిప్లొమా తరువాత ఇంజనీరింగ్ లో ఈ సెట్ఎంట్రెన్స్ ఎక్సజాం ద్వారా లేటరల్ ఎంట్రీ విధానం లో 2వ సంవత్సరం లో జాయిన్అవ్వచ్చు. ఎం సెట్,జే ఈ ఈ ఎంట్రెన్స్పరీక్షాద్వారా జాయిన్అవ్వచ్చు. 


మూడు సంవత్సరాల డిప్లొమాలో కోర్సుస్ :
 సివిల్,ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్,మెకానికల్,కంప్యూటర్,ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్,ఐటీ,కెమికల్,మైనింగ్,ప్రింటింగ్ టెక్నాలజీ,కెమికల్ ఇంజనీరింగ్ మొదలైనవి డిప్లొమా లోఉంటాయి. 


మూడున్నరేళ్ల డిప్లొమాలో కోర్సెస్: 
మెటలర్జికల్,సిరామిక్,లెదర్ టెక్నాలజీ,టెక్స్ టైల్ టెక్నాలజీ మొదలైనవి ఉంటాయి. 



స్పెషల్ డిప్లొమా కోర్సులో:
ఎంబెడెడ్ సిస్టం,టీవీ అండ్ సౌండ్ ఇంజనీరింగ్,బయో మెడికల్ కమ్యూనికేషన్ మొదలైన ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు ఉన్నాయ్. 

ఆర్ జేసీ:
రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రాయడం వలన రాష్ట్ర ప్రభుత్వ గురుకుల జూనియర్ కాలేజ్ ఉచితంగా వసతి మరియు ఉచితంగాఎంపీసీ,బైపీసీ,హెచ్ఈసీ,సి ఈ సి,కోర్సులలో విద్యను అందిస్తారు.


ఇంటర్మీడియట్ రాష్ట్ర స్థాయి ర్యాంకులు పొందిన వారికి ఒక లక్ష రూపాయలు నగదు బహుమతి ఇస్తారు. 


ఐఐఐటి:
 పదోతరగతి తరువాత ఆరేళ్ళ ఇంటెగ్రేడ్ ఇంజనీరింగ్ కోర్సనుఇన్స్టిట్యూట్ అఫ్ ఇంఫెర్మాషన్ టెక్నాలజీ(ఐఐఐటి)రెండేళ్ల ఇంటర్ తో పాటు,నాలుగేళ్ళ బీటెక్ కోర్సును అందిస్తుంది.


పదో తరగతిలో సాధించిన GPA ఆధారంగా,గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు మాత్రమే సీట్లు కేటాయిస్తారు. 


కెమికల్,సివిల్,కంప్యూటర్స్,మెటీరియల్,మెకానికల్,మెటలర్జి ఇంజనీరింగ్ కోర్సులు ఉంటాయి. 

అగ్రికల్చర్ డిప్లొమా:
ప్రవేశం:
పదోతరగతి తరువాత లేదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ విద్యార్థులు అప్లై చెయ్యవచ్చు. ఎంట్రెన్స్ టెస్ట్ ఉండదు. 10th మెరిట్ ఆధారంగా ప్రవేశం  ఇస్తారు. 



గ్రామీణప్రాంత విద్యార్థులు వ్యవసాయంలో డిప్లొమా కోర్సును ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.1-10th వరకు నాలుగేళ్లు గ్రామీణ ప్రాంతాలలో చదవాలి. 
దీనిఉపాధిఅవకాశాలుపొందవచ్చు.

వెటర్నరీ,ఫిషరీస్ హార్టికల్చర్:
విద్యార్థులకు వ్యవసాయంతో పాటు దాని అనుబంధరంగాలుపశుసంవర్ధకం,ఉద్యానశాఖ,మత్యశాఖ,వ్యవసాయం,తదితర రంగాలలో కోర్సులు ఉన్నాయ్. 



ప్రైవేట్ డిప్లొమా కాలేజీలో అందుబాటులో ఉన్నాయ్.
ప్రవేశం:
పదోతరగతి మెరిట్ ఆధారంగా ప్రవేశం ఉంటాయి.ఎంట్రెన్స్ టెస్ట్ ఉండదు. 1-10th వరకు నాలుగేళ్లు గ్రామీణ ప్రాంతాలలో చదవాలి. 

  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి